One Tv News - NEWS / కర్నూలు జిల్లా : విశ్వ బ్రాహ్మణ విశ్వ కర్మ చేతి వృత్తి దారులకు ప్రధాన మంత్రి కౌశల్ యోజన పధకం అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ మేరకు కర్నూలు నగరంలోని వినాయక ఘట్ యందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్టిసన్ సెల్ స్టేట్ కన్వీనర్ కొండముడి బంగారు బాబు మాట్లాడుతూ.... విశ్వ బ్రాహ్మణ విశ్వ కర్మ కుటుంబాలకు ప్రధాన మంత్రి విశ్వకర్మ కౌశల్ యోజన పధకం ను ఏ విధంగా లబ్ది పొందాలని ఎలా అప్లై చేసుకోవాలి ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి అని వివరించేందుకు రాష్ట్ర స్థాయి పర్యటనలో భాగంగా కర్నూలు పట్టణానికి కూడా విచ్చేసి అవగాహనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.విశ్వ బ్రాహ్మణ చేతి వృత్తి దారులకు వివరించారు ఈ కార్యక్రమ నిర్వహణ మధన మోహన్ ఆచారి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమం లో సోమేశ్వర ఆచారి, దేవాపూజా ధనుంజయ ఆచారి, బ్రహ్మయ్య ఆచారి, శరబయ్య ఆచారి,వడ్ల శ్రీనివాసులు ఆచారి,వడ్ల సుమంత్ ఆచారి,పురుషోత్తం ఆచారి,బ్రహ్మయ్య ఆచారి,విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
One Tv News