One Tv News - NEWS / ప్రకాశం జిల్లా : ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని కందులాపురం సెంటర్లో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎమ్మార్పీఎస్ నాయకులు శనివారం నిరాహారదీక్ష చేపట్టారు. జగ్జీవన్ రావు విగ్రహం ఏర్పాటుకు అనుమతులతో పాటు బి.ఆర్ అంబేద్కర్ భవనం కోసం స్థలాన్ని కేటాయించాలని, అంబేద్కర్ కాలనీలోని రోడ్లు నిర్మించాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టారు.
దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు నిరాహార దీక్ష చేపడుతున్న ఎమ్మార్పీఎస్ నాయకులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
One Tv News